మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

*మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్*

అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగుల జీవితాల పట్ల తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం పిలుపుమేరకు చేపడుతున్న సడక్ బందులో భాగంగా అలంపూర్ లోని NH 47 టోల్ ప్లాజా దగ్గర నిర్వహించిన


 సడక్ బందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ *ఎస్ఏ సంపత్ కుమార్* ను పోలీసులు శాంతినగర్ లోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్టు చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా... ఎన్నికలు ఆరు నెలల ముందు గ్రూప్ 1 ,గ్రూప్ 2 ,గ్రూప్ 4 ,మరియు డీఎస్సీ నోటిఫికేషన్లు వేసి ఎలాంటి నియమ నిబంధన లేకుండా ప్రకటించడంతో  లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు హైదరాబాద్ మరియు వివిధ జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర మొత్తంలో లక్షల రూపాయలు వెచ్చించి కోచింగులు తీసుకుంటున్న క్రమంలో ... 

బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచితం నిర్ణయాల కారణంగా గ్రూప్ వన్ పరీక్షను సరిగా నిర్ణయించ లేకపోవడం ,ఒకసారి రద్దీ కావడము మరియు సరియైన నిర్ణయాలు తీసుకోకుండా రెండోసారి కూడా రద్దు కావడం టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్టుంది

 గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడం గ్రూప్ 4పరీక్ష నిర్వహించిన ఫలితాలు ఇవ్వకుండా మరియు టెట్ సంవత్సరానికి ఒకటి పెట్టుకుంటూ పోతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పటివరకు కూడా ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయకుండా హడావిడి ప్రకటించిన డీఎస్సీని వాయిదాలు వేసుకుంటo

 పోవడం వలన నిన్న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందినటువంటి మర్రి ప్రవళిక 23 సంవత్సరాల డీఎస్సీ అభ్యర్థిని చిక్కడిపల్లిలో అశోక్ నగర్ లోని బృందావన బాలికల హాస్టల్ లో ఉంటూ అన్ని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో డీఎస్సీ కూడా వాయిదా కావడంతో హాస్టల్లోనే ఉరివేసుకొని మరణించడం జరిగింది.

 దీనికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం చేపడుతున్న సడక్ బందులో భాగంగా అల్లంపూర్ తాలూకా పుల్లూరు టోల్గేట్ దగ్గర అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సడక్ బందులు పాల్గొనడానికి బయలుదేరుతుండగా శాంతినగర్ లోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.

సంపత్ కుమార్ గారి వెంట అలంపూర్ తాలూకాలోని అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Comments