శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొన్న గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి

*శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొన్న గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి*


సీ కే న్యూస్ ప్రతినిధి,కొల్లాపూర్:


*మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి* 


సింగోటం శ్రీ శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు  మరియు కొల్లాపూర్ జట్పిటీసి భాగ్యమ్మ తో పాటు  కొల్లాపూర్ నియోజక వర్గ మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు 


 అనంతరం ఆమె అక్కడికి వచ్చిన కొంతమంది మహిళలతో జాతర గురించి మాట్లాడుతూ జనవరి మాసం లో మొదటగా వచ్చే జాతరలో భాగంగా కొల్లాపూర్ నియోజక వర్గం లోని సింగోటం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఇది ఎనిమిదవ ఏట అప్పటి నుండి ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుపుకునే జాతర,

 ఇక్కడికి కొల్లాపూర్ నియోజక వర్గంతో పాటు ఆంధ్ర నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో  స్వామి వారి భక్తులు పాల్గొంటారు అనీ భక్తులతో చర్చించడం జరిగింది  అలాగే  ఇక్కడి ప్రత్యేకత లక్ష్మీనరసింహస్వామి వారు లింగాకారంలో ఉండటం జరిగింది ప్రపంచంలో ఇలాంటి రూపం ఎక్కడ లేదు అంటూ వారికి చెప్పడం జరిగింది

 అనంతరం ఆమె  ప్రత్యేక పూజలతో స్వామివారినీ దర్శించుకొని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో చల్లగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు  కొల్లాపూర్ నియోజక వర్గ మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో ఈ రథోత్సవంలో పాల్గొనారు

Comments