నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది సీకే న్యూస్ -- ఎమ్మెల్యే మట్టారాగమయి

*నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది సీకే న్యూస్ -- ఎమ్మెల్యే మట్టారాగమయి*

-- సీ కే న్యూస్ నుతన క్యాలెండర్ ను  ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి.

సికె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్ .


మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ సీకే న్యూస్ ఆర్సి ఇంచార్జ్ మునీర్ ఆధ్వర్యంలో సీకే న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.


ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ప్రజల సమస్యలను వెలికితీస్తూ అవినీతి అధికారులకు రాజకీయ నాయకులకు అతీతంగా ఆధునిక కాలానికి అనుగుణంగా ఎదుగుతున్న సి కె న్యూస్ పత్రికా రంగంలో సమాజంలో ప్రత్యేక స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెమిని సతీష్ , గద్దె చెన్నారావు, కమల్ పాషా, దిలీప్, భరత్, రాకేష్ , సామేలు, ప్రసాద్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments