క్యాట్ పరీక్షలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

*క్యాట్ పరీక్షలలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం*


సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం


ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ చైతన్య పాఠశాలలోని విద్యార్థులు  జాతీయస్థాయి క్యాట్ పోటీ పరీక్షలలో అద్భుత విజయం సాధించారు. ఆరుగురు విద్యార్థులు క్యాష్ ప్రైస్ మరియు గోల్డ్  మెడల్స్,  సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది , 


118 మందికి గోల్డ్ మెడల్స్ , సర్టిఫికెట్స్ రావడం జరిగింది.  ఏడవ తరగతి విద్యార్థులు సమ్మెట ఉజ్వలసింహ, కొండపనేని నిహాంత్ , బానోతు లోక్షిత్ , అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఆమెడ వినీల, బానోతు యశస్విని,  ఆరవ తరగతి నుండి జంగం ఆరాధ్య క్యాష్ ప్రైస్, గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ గెలుచుకోవడం జరిగింది.

             ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్  మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు ఇటు పోటి పరీక్షలలోనూ ,  ఆటపాటలలోను విజయాలు సాధించడం జరుగుతుందని అలాగే చైతన్య విద్యాసంస్థల కరికులం ఇన్ని విజయాలకు కారణమని తెలియజేశారు. 

        ఈ కార్యక్రమంలో  శ్రీ చైతన్య  విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్,  డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య,  పాఠశాల ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ , వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నివేదిత,  డీన్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,   విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments