రాజీవ్ యువ వికాసం పథకంపై హై లెవెల్ కమిటీ
సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిపై హై లెవెల్ కమిటీతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశం.
నిరుద్యోగ యువత ఆశలను ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రతిష్టాత్మకంగా భావించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చాం.
జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ ల పంపిణీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో ఓకే సారీ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలి. ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశల వారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలి.
పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు,రాజీవ్ యువ వికాసంలో వారికి అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశం. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లకు రాజీవ్ వికాసం కింద అవకాశం కల్పించాలంటూ యువత దరఖాస్తులు చేసుకున్నారు, ఆ దరఖాస్తులన్నిటిని పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు వెంటనే పంపేలా చర్యలు చేపట్టాలి.
గత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖలను, రాష్ట్ర యువతను గాలికి వదిలేశారు. గత పదేళ్లలో సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందిన మొత్తాన్ని ప్రజా ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆయా వర్గాల నిరుద్యోగ యువతకు చేయూతనిస్తుంది . దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు, ఏ రాష్ట్రంలోను ఒక సంవత్సరంలో స్వయం ఉపాధి కోసం 9 వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం వారం క్రితమే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో సమావేశం నిర్వహించాం, ఆ తర్వాత సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి పథకాన్ని చివరి దశకు చేర్చారు వారికి నా అభినందనలు.
అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 2న శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశం.
ఈ హై లెవెల్ కమిటీ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment