బిర్యానీలో బల్లి..బల్లి మంచిగా ఫ్రై అయ్యింది తిను అంటూ నిర్లక్ష్యం...
ఓ రెస్టారెంట్లో కస్టమర్ తింటున్న బిర్యానీలో బల్లి కన్పించింది ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే..గుజ్జా కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందినవాడు.
బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన జి.కృష్ణారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై గల ఏఆర్ మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లి చికెన్ బిర్యానీ భుజిస్తున్నాడు. అందులో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
వెంటనే రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఖంగుతిన్నాడు. 100 డయల్ చేసి అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులు రెస్టారెంట్ను సందర్శించి విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్కు దృష్టికి తీసుకొచ్చారు.
పుడ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం హోటల్ను సందర్శించి తనిఖీ చేస్తానని తెలిపినట్లు మున్సిపల్ పర్యావరణ అధికారి ప్రణవ్ తెలిపారు.
కాగా బిర్యానీలో బల్లి వచ్చిన సంఘటనపై ఫిర్యాదు అందిందని.. ఈ అంశాన్ని మున్సిపల్, ఫుడ్సేఫ్టి అధికారులే నిర్ధారించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు.
Comments
Post a Comment