ఎంపీ నామ సుడిగాలి పర్యటన

 --  ఎంపీ నామ నాగేశ్వరావు సుడిగాలి పర్యటన

 ---పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ నామా నాగేశ్వరరావు .


సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.


గురువారం ఎంపీ నామా నాగేశ్వరరావు మండలంలోనీ  గ్రామాలలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.



ఈ కార్యక్రమంలో బుగ్గపాడు గ్రామంలో గత కొద్ది కాలం క్రితం మరణించిన గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాసరావు  కుటుంబ సభ్యులను పరామర్శించారు,రుద్రాక్ష పల్లి గ్రామంలోని గ్రామ బీఆర్ఎస్ పార్టీ జోనల్ సభ్యులు దాసరి ప్రసాద్ రెడ్డి  మాతృమూర్తి ఇటీవల మరణించగా వారి దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,

తుంబూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ జోనల్ సభ్యులు కొపుల అప్పారావు  తండ్రి కొప్పుల సుబ్బారావు  దశదినకర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించినారు.


వీరితోపాటు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు  ,మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్ , బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాస్ రావు , జడ్పిటిసి  సభ్యులు కూసంపూడి రామారావు ,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొడ్డా శంకర్ రావు , వల్లభనేని పవన్  సోషల్ మీడియా వినుకొండ మరియు గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments